ఆంధ్రప్రదేశ్‌

నూకాంబిక ఆలయానికి టిటిడి నిధులేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాంబిక ఆలయం కోసం నాలుగెకరాల భూమి కొనుగోలుకు టిటిడికి చెందిన ఐదుకోట్ల నిధులు వినియోగించడటం చెల్లదంటూ ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో కేసు నమోదైంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అనకాపల్లి పర్యటనకు వెళ్లిన సమయంలో నూకాంబికా ఆలయానికి నాలుగెకరాల భూమి కొనుగోలు చేసేందుకు టిటిడి నుండి నిధులు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే దరఖాస్తు ఇచ్చారు. ఈ దరఖాస్తు ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ టిటిడికి ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు టిటిడి బోర్డు ఒక తీర్మానం చేస్తూ, ఐదుకోట్ల రూపాయలు నూకాంబికా ఆలయానికి భూమికొనుగోలుకు మంజూరు చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఒక జీఓ జారీ చేసింది. ఈ జీఓ చెల్లుబాటుకాకుండా చూడాలంటూ, టిటిడి నిధులను ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం వినియోగించేందుకు వీలులేదంటూ తిరుపతికి చెందిన ఎం. గోపాల్‌రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిలుపుదల చేస్తూ, హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం స్టే ఇచ్చారు. ప్రతివాదులకు నోటీసు జారీ చేశారు.