ఆంధ్రప్రదేశ్‌

కేసులు కొట్టేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: కృష్ణా జిల్లా కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించానంటూ కృష్ణాజిల్లా నందిగామ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెనుగంచిప్రోలు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు డాక్టర్ల వద్ద నుంచి పోస్టుమార్టమ్ నివేదికను గుంజుకోవడానికి ప్రయత్నించారని, కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలపై నందిగామ పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరో 14మందిపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారని కూడా పోలీసులు అభియోగం మోపారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని, తనపై కేసును కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో జగన్ అభ్యర్థించారు.