ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశంలో ఎమ్మెల్యేలే ఇన్‌ఛార్జిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 10: ప్రకాశం జిల్లాలో పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇకపై వారే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి వరకు కొనసాగిన ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు క్లాసు ఇచ్చారు. ఇటీవల వైసిపి నుంచి తెలుగుదేశంలో చేరిన అద్దంకి, చీరాల, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలే ఇన్‌చార్జిలుగా ఉంటారని, ఇతరులెవ్వరూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు మనమే పూర్తిచేస్తామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో మొత్తం 12 సీట్లు మనమే గెలవాలని, ముఠా తగాదాలు మొదలుపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అనే్న రాంబాబుకు అసలు పిలుపు లేకపోవటం గమనార్హం.