ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రా ట్రంప్ చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 11: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను ఎలా భయబ్రాంతులకు గురిచేస్తున్నారో.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారని వైకాపా మహిళా నేత రోజా ఆరోపించారు. శనివారం ఇక్కడ నిర్వహించిన వైకాపా జిల్లా సమీక్ష సమావేశానికి ఆమె, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత, భరోసా, సంక్షేమం కరవైందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో టిడిపి నేతలు ఉన్నారని, ఆ తోడేళ్లను కాపాడుకునేందుకు ఆడవాళ్ల మానప్రాణాలు పణంగా పెట్టారని ఆమె విమర్శించారు. మహిళల రక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరేళ్ల అంగన్‌వాడీ పిల్లలకు అందించే ‘బాలామృతం’ పౌష్టికాహారాన్ని లాక్కున్నారని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే రూ.30వేలు ఇస్తామన్నారని అదీ అమలుకు నోచుకోలేదన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు పని చేయాలన్నారు. పునర్విభజన కింద మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును తాను రాష్టప్రతికి ప్రైవేటు బిల్లుగా పంపినట్టు తెలిపారు. ఆ బిల్లు అక్కడ ఆమోదం పొందితే దానిని లోక్‌సభలో ప్రవేశపెడతారని ఆయన వివరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.