ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 13: ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం ప్రజలందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో వేకువజామున రెండున్నర గంటల ప్రాంతంలో రెండు సెకెన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలకు షెల్ఫ్‌లో ఉన్న గినె్నలు కిందపడడంతో నిద్రమత్తులో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని అద్దంకి, కొరిశపాడు, జెపంగులూరు, బల్లికురవ, ముండ్లమూరు, తాళ్ళూరు, చీమకుర్తి మండలాల్లో భూమి కంపించినట్లు వార్తలు వెలువడ్డాయ. ఆయా మండలాల్లోని ఇళ్ళల్లో ఉన్న సామాన్లు కిందపడిపోయాయి. కాగా ఆయా మండలాల్లోని గ్రామాల ప్రజలు కొంతమంది పరుగులు తీశారు.