ఆంధ్రప్రదేశ్‌

ఇంట్లో బాణసంచా పేలుడు: ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, ఏప్రిల్ 18: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గురవాం గ్రామంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో బాణసంచా పేలడంతో ఇద్దరు మృతి చెందారు. తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాలవలస చంద్రరావు, పాలవలస పోతయ్య, పాలవలస విజయకుమార్ గత కొంతకాలంగా ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బాణసంచా తయారుచేస్తుండగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మంటలు వ్యాపించడంతో ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు సైతం పేలాయి. ఈ ప్రమాదంలో గేదెల పెంటయ్య(18), గొర్లె లక్ష్మణరావు(17) అక్కడికక్కడే మృతి చెందారు. పాలవలస చంద్రరావు, పాలవలస శ్రీను, పాలవలస లావణ్య, గేదెల ఈశ్వరరావు, దుర్గమ్మ, గేదెల రమేష్, కోటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో లావణ్య, ఈశ్వరరావు, ప్రశాంత్, శ్రీను పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం విశాఖపట్టణం కెజిహెచ్‌కు తరలించారు.