ఆంధ్రప్రదేశ్‌

అల్పపీడన ద్రోణితో వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 19: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం రాత్రి వెల్లడించింది. దీని ప్రభావం వలన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉందని, అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిస్తాయని పేర్కొంది. అలాగే ఏపిలో కూడా ఆదివారం చెదురుమదురు వర్షాలు కురిశాయి. తునిలో అత్యధికంగా మూడు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటలపాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.