ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదమరి, మార్చి 19: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు టెంపో ట్రావెలర్‌లో ఏడుగురు కర్నాటక రాష్ట్రం నుంచి తిరుమలకు వెళ్తున్నారు. ఈక్రమంలో మండలంలోని లక్ష్మయ్యకండ్రిగ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఆ వాహనాన్ని తప్పించబోయి ఢీకొంది. ఈ సంఘటనతో టెంపో నుజ్జునుజ్జు కావడంతో పాటు డ్రైవర్ విసాల్ (40), కామాక్షి (27), రిదం (2)లు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా సంతోష్ (47), పూజ (9), రేణుక (30), అభిషేక్ (8) తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని తొలుత చిత్తూరు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

చిత్రం..సంఘటన స్థలంలో నుజ్జునుజ్జయిన టెంపో