ఆంధ్రప్రదేశ్‌

నా పరువు తీశారు నెల్లూరు ఫలితంపై నారా ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: అభ్యర్థి ఎంపిక, సమన్వయలోపం అభ్యర్థి మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిసి తన పరువు తీశాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి జరిగిన నెల్లూరు జిల్లా పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థి ఎంపికలో కీలకపాత్ర పోషించిన మంత్రి నారాయణపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మిమ్ములను నమ్మి పట్ట్భాని అభ్యర్థిగా ఎంపిక చేశామని అయినా పార్టీ నాయకులను సమన్వయం చేయటంలో శ్రద్ధ పెట్టలేదని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒక దశలో మీరంతా కలిసి నా పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకనైనా నాయకులు మితిమీరిన ఆత్మవిశ్వాసం వదిలి ప్రజల్లోకి వెళ్ళాలని హితవు పలికారు. నాయకుల సమన్వయం లోపం వలన 14 వందల ఓట్లు కోల్పోయామని పెదవి విరిచారు.