ఆంధ్రప్రదేశ్‌

అధికారంలోకి వస్తే విఆర్‌ఎలకు 15 వేలు ఇస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 24: ‘వచ్చే ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే మీకు రూ.15 వేల వేతనం కచ్చితంగా ఇప్పిస్తా’నని విఆర్‌ఏలకు వైసిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా విఆర్‌ఎ నాయకులు, ఆందోళన చేస్తున్న వారు హర్షధ్వానాలతో నిరసన ప్రాంగణాన్ని హోరెత్తించారు. విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్న విఆర్‌ఎలకు జగన్ మద్దతు ప్రకటించారు. పక్క రాష్టమ్రైన తెలంగాణలో విఆర్‌ఎలకు 10,700 వేతనం ఇస్తుంటే ఎపిలో మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, దీనిపై మూడేళ్లుగా పోరాడుతున్నా చంద్రబాబు మాత్రం ఎవ్వరి మాటలు వినిపించుకోవడం లేదని, ఆయన చర్మం మందమెక్కిపోయిందని ఎద్దేవా చేశారు. మనం ఏం చెప్పినా ఆయన చెవికి ఎక్కించుకునే పరిస్థితిలో లేరని ఈ ఏడాది, ఏడాదిన్నర కూడా గట్టిగా ప్రయత్నిద్దామని, అయినా చంద్రబాబుతో పనిచేయించుకోలేకపోతే ఎన్నికల తర్వాత వచ్చే మనందరి ప్రభుత్వంలో కచ్చితంగా విఆర్‌ఎలకు రూ.15000 జీతం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. విఆర్‌ఎల సంఘం నాయకులతో పాటు సిపిఎం బాబూరావును కూడా పిలిపించుకుని, మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూస్తామన్నారు. ఎవ్వరూ అధైర్యపడవద్దని, రానున్నది మన ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు.