ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలో అరాచక రాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట), మార్చి 24: నవ్యాంధ్రలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై అధికార పక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారని, ప్రత్యేక హోదా, కరువు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల సహా ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని ఆమె విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ చర్చ జరిగితే తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందన్నారు. అందుకే ప్రతిసారీ అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు ఛార్జీషీటులో చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ తాము వాయిదా తీర్మానం ఇస్తే దానిపై చర్చించకుండా అది పనికిమాలిన కేసు అని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకరు, పక్క రాష్ట్రంలో జరిగినదాన్ని తీసుకువచ్చి ఎపి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతారు అని మరొకరు మాట్లాడుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్ తమకు తండ్రిలాంటివారని, ఆయనపై తమకు గౌరవం ఉందన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబునాయుడు అడ్డంగా బుక్కయ్యారని, ఆడియో, వీడియో టేపుల్లో ఆయన దొరికిపోయారన్నారు. బ్రీఫ్‌డ్‌మి అన్న గొంతు చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని, చంద్రబాబు డబ్బులిచ్చారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఇకనైనా ప్రతిపక్షాన్ని గొంతు నొక్కడం మానరా అని రోజా డిమాండ్ చేశారు.