ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి ఆర్జిత సేవలకు యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 29: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత చేరువయ్యేందుకు ‘ గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్’ యాప్‌ను ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం 10.36 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ తిరుమలలో భాగంగా టిటిడి రూపొందిస్తున్న ఆన్‌లైన్ లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ. 1.30 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. ఈక్రమంలో టి సి ఎస్ సహకారంతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ ద్వారా భక్తులకు వేగంగా, సులభంగా ఎక్కడి నుంచైనా సేవలను పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి ఈ-హుండీ, ఈ-డొనేషన్, రూ. 300 దర్శనటికెట్లు బుకింగ్, గదుల బుకింగ్, సదుపాయాలు ఉన్నాయన్నారు.