ఆంధ్రప్రదేశ్
తూ.గో.లో ఇద్దరు బాలికలకు స్వైన్ ఫ్లూ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 30 March 2017
రావులపాలెం, మార్చి 29: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఇద్దరు బాలికలకు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది.సత్తి వెంకటరెడ్డి చిన్న కుమార్తె శ్రీజ (15)కు ఇటీవల జ్వరం, జలుబు, దగ్గు రావడంతో స్థానిక వైద్యులవద్ద చికిత్స చేయించారు. తగ్గక పోవడంతో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో ఆమెకు స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. ఆమెతో పాటు ఆమె సోదరి దీప్తిలో కూడ ఇవే లక్షణాలు కన్పించినప్పటికీ ఆమెకు సాధారణ జ్వరంగా వైద్యులు నిర్ధారించారు. వీరి తల్లి నళిని (47) ఈ నెల 24న జ్వరం, జలుబు లక్షణాలతో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందింది. అయితే ఆమెకు న్యూమోనియా వ్యాధి సోకి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.