ఆంధ్రప్రదేశ్‌

గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, ఏప్రిల్ 10: కుటుంబ కలహాల నేపథ్యంలో అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో సహా కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మూడు మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన మానేపల్లి పుష్పావతి ఆమె సోదరి నల్లమిల్లి ప్రమీల కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారి ముగ్గురు పిల్లలతో కలిసి పలివెల లాకుల వద్ద కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈఘటనలో నల్లమిల్లి ప్రమీలను స్థానికులు రక్షించగా, మానేపల్లి అంజన్ అనే బాలుడి మృత దేహం వెంటనే లభ్యమయ్యింది. ఈ ఘటనలో మానేపల్లి పుష్పావతి, ఆమె కుమార్తె మాన్విత, ప్రమీల కుమారుడు శ్రీగోధ గల్లంతయ్యారు. ఈ ముగ్గురి కోసం గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం కండ్రిగకు సమీపంలో అమలాపురం ప్రధాన పంటకాల్వలో మూడు మృతదేహాలను గుర్తించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు కొత్తపేట ఎస్సై డి విజయ్‌కుమార్ తెలిపారు.