ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: ఝూర్‌ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ భూ ఉపరితలంపై అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఒకటి,రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, తెలంగాణలోని నిజామాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలోని రామగుండం, హైదరాబాద్, ఎపిలోని రెంటచింతల, నందిగామలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం 41 డిగ్రీలు, గన్నవరం 40 డిగ్రీలు, కావలి, నెల్లూరు 39 డిగ్రీలు, తుని 38 డిగ్రీలు, మచిలీపట్నం, కాకినాడ, ఒంగోలు 37 డిగ్రీలు, విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద 36 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.