ఆంధ్రప్రదేశ్‌

చిన్నారిపై అఘాయిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఏప్రిల్ 20 : వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత ప్రియుడి సహకారంతో కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తుండగా, చూస్తుండలేకపోయిన స్థానికులు వారిద్దరికీ దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం రాత్రి మదనపల్లె పట్టణ శివారుప్రాంతంలో చోటుచేసుకుంది. చిత్తూరుజిల్లా మదనపల్లె రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన భాగ్యమ్మకు ఒక కుమార్తె ఉంది. అయితే భాగ్యమ్మ అదేప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే మదనపల్లెకు చెందిన పందుల వ్యాపారి తిరుపతయ్యకు అనంతపురంలో భాగ్యమ్మతో పరిచయం ఏర్పడింది.
దీంతో భాగ్యమ్మ తన మొదటి ప్రియుడిని వదలి రెండవ ప్రియుడు తిరుపతయ్యతో కలసి గత రెండుమాసాల కితం మదనపల్లెకు వచ్చేసింది. మదనపల్లె పట్టణ శివారుప్రాంతం గురుకుల పాఠశాల వెనుక మంజునాధకాలనీలో తన కుమార్తె శైలజ (3)తో నివాసం ఉంటోంది. వీరి మధ్య వివాహేతర సంబంధానికి చిన్నారి శైలజ అడ్డుపడుతోందని ప్రియుడు తిరుపతయ్య చిన్నారిని తీవ్రంగా చితకబాదేవాడు. దీంతో ఆ చిన్నారి బిక్కుబిక్కుమంటూ ఆరుబయటకు వచ్చి ఏడ్చుకుంటు ఉండిపోయేది. ఇలా కొంతకాలం జరుగుతూ ఉండేది. బుధవారం రాత్రి ఈ వేధింపులు పరాకాష్టకు చేరడంతో స్థానికులు భాగ్యమ్మను, ఆమె ప్రియుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు సిఐ హనుమంతనాయక్ వెల్లడించారు.