ఆంధ్రప్రదేశ్‌

అమరావతి నిర్మాణానికి నిర్బంధ చర్యలు అమలు చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులను ఇబ్బంది పెట్టమని, నిర్బంధం చర్యలు అమలు చేయమని, చట్టం ప్రకారం నడుచుకుంటామని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విజయవాడకు చెందిన అనుమోలు వెంకట తిరుమల చంద్‌గాంధీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి విచారించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పై హామీ ఇచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి రచనా రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లకు చెందిన భూములు సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాయని, వీరి భూములను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా చెట్లను జెసిబితో నరికివేశారని, టెండర్ల నోటిఫికేషన్‌లో వీరి భూములను ప్రస్తావించారని తెలిపారు. అనంతరం ఈకేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.