ఆంధ్రప్రదేశ్‌

కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), ఏప్రిల్ 27: భర్త వేధింపులకు తాళలేక అతని భార్య, కుమారుడు కిరోసిన్ పోసుకొని సజీవ దహనమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధి జెట్టివారి వీధికి చెందిన చందనాల ప్రమీల (25), ఆమె కుమారుడు సాయి (5) ఎన్‌కె రాజపురం గ్రామానికి వెళ్లే రహదారిపై ఒంటిపై కిరోసిన్ పోసుకొని గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిఐ వేణుగోపాలరావు, ఎస్‌ఐ చంద్రవౌళి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమీలను సరుబుజ్జిలి మండల కేంద్రానికి చెందిన చందనాల మురళి 2010లో వివాహమాడాడు. వివాహమైన తర్వాత భర్త వేధింపులు తాళలేక ప్రమీల పాలకొండ వచ్చి జట్టివారివీధిలో తల్లి నాగమణితో ఉంటూ ఓ బట్టల దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. తాగుడుకు బానిసై, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న భర్తకు దూరం గా ఉంటోంది. మూడు రోజుల క్రితం ప్రమీల తల్లి నాగమణి బంధువుల ఇంటికి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న మురళి ప్రమీల దగ్గరకు వచ్చి మద్యం తాగి వేధించసాగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ముందుగా కిరోసిన్ తన ఒంటిపై పోసుకొని, అనంతరం కుమారుడిపై కూడా పోసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది.