ఆంధ్రప్రదేశ్‌

కోర్టు భవనాల నిర్మాణంలో జాప్యంపై ఏపి సిఎం ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: విజయవాడ సివిల్ కోర్టు ఆవరణలోని ఏడు అంతస్తుల భవన నిర్మాణంలో జాప్యంపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గ సభ్యులు సచివాలయంలో సిఎంను కలిశారు. కోర్టు భవన నిర్మాణ పనుల్లో జాప్యంపై సిఎం దృష్టికి తీసుకువచ్చారు. జాప్యానికి కారణాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, అపార్టుమెంట్ కాంప్లెక్సు నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని, మహిళా, పురుష న్యాయవాదులకు వేర్వేరు డైనింగ్ హాళ్ల నిర్మాణానికి 20 లక్షల రూపాయలు కేటాయించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని సిఎం హామీ ఇచ్చారు.