ఆంధ్రప్రదేశ్‌

కియా ప్లాంట్‌లో ఉద్యోగాలు స్థానికులకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: అనంతపురం జిల్లాలో కొరియాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ కంపెనీ కియా ఏర్పాటు చేసే ప్లాంట్‌లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన కియా కంపెనీతో ఒప్పందం జరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. సచివాలయం ఒకటవ బ్లాక్‌లో గురువారం ఉదయం కియా కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడుతూ దాదాపు రూ.13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే ఈ తయారీ కేంద్రంలో ఏటా 3 లక్షల చిన్నకార్లు తయారవుతాయని చెప్పారు. అవకాశం ఉంటే 4 లక్షల కార్ల వరకు తయారయ్యే అవకాశం ఉందన్నారు. 2018 డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుందన్నారు.
2019 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తారని చెప్పారు. ఇక్కడ తయారయ్యే కార్లలో 90 శాతం దేశీయ మార్కెట్‌లోనే విక్రయిస్తారని, మిగిలిన పది శాతం ఎగుమతి చేస్తారని వివరించారు. ఈ కార్ల ఉత్పత్తి కేంద్రంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా 12వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, తక్కువ ధర కార్లను ఈ సంస్థ తయారు చేస్తుందని చెప్పారు. 1944లో ప్రారంభమైన కియా కంపెనీకి దక్షిణకొరియా, మెక్సికో, జర్మనీ దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయని, 51వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్ల కంపెనీతో ఒప్పందం కుదరడంలో అధికారుల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. అభివృద్ధికి, ఆటోమొబైల్ రంగానికి లింక్ ఉందని సిఎం చెప్పారు. ఎవరైనా కొంత డబ్బు సంపాదించగానే ద్విచక్ర వాహనం కొంటారని, ఇంకా ఎక్కువ సంపాదిస్తే కారు కొంటారని చెప్పారు. 2020 నాటికి ఆటోమొబైల్ రంగంలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి ఉపాధి లభించాలనేది తమ లక్ష్యమన్నారు. నీటి లభ్యతపై పారిశ్రామిక రంగం అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు రావడంతో అక్కడ పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే
అతి పెద్ద సోలార్ ప్రాజెక్ట్
కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు చంద్రబాబునాయుడు తెలిపారు. అది 1000 మెగావాట్లు ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టు అని చెప్పారు. ఇంతటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.