ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి పేదరికం అడ్డు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: జీవితంలో ఎదగడానికి పేదరికం అడ్డంకి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గొప్ప గొప్ప వాళ్లంతా పేదరికం నుంచే వచ్చారని, సాధించాలన్న తపన ఉండాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదన్నారు. గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆరువారాల శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థుల నుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. క్రితం ఏడాది ఎంపికైన 22 మందిలో 12 మంది ఏపి విద్యార్థులుంటే ఈ ఏడాది 53 మందికి గానూ 44 మంది విద్యార్థులు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకోవడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి వంద శాతం మంది ఏపీ విద్యార్థులే ఉంటే మరింత సంతోషిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బిట్స్ పిలానీకి సంబంధించి ఓ సంఘటనను గుర్తుచేశారు. గతంలో బిట్స్ పిలానీకి 70 శాతం మంది తెలుగు విద్యార్థులు ఎంపిక కావడంతో అది కాస్తా తెలుగు పిలానీగా మారిపోయిందని.. దీంతో బిట్స్ పిలానీవాళ్లు తెలుగు విద్యార్థులను అడ్డుకోవడం కోసం సిలబస్‌నే మార్చేసినా అంతా మనవాళ్లే ఎంపికవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో లక్ష మందికి ఇంగ్లీష్‌లో శిక్షణ ఇచ్చేలా బ్రిటీష్ కౌన్సిల్‌తో ఎంఓయూ చేసుకున్నామన్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శిక్షణ కార్యక్రమానికి వెళ్లిన వారిలో 65 శాతం మంది ఆడపిల్లలుండటం ఆనందించదగ్గ విషయమన్నారు. మహిళాభివృద్ధి జరిగితే సమాజంలో చాలావరకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో 33 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టామన్నారాయన. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద పెద్ద యూనివర్సిటీలన్నీ ఏపీకి వచ్చేలా చేయడానికి కసరత్తులు చేస్తున్నామన్నారు. ఎప్పటి నుంచో చెబుతున్న ‘డేర్ టు ట్రీం ట్రై టు అచీవ్’ అన్న నినాదాన్ని పుణికిపుచ్చుకుని.. కలల్ని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని విద్యార్థులకు హితబోధ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా భారతీయ విద్యార్థులు అందునా తెలుగు విద్యార్థులు అన్ని రంగాల్లోనూ గొప్పవాళ్లుగా నిలవాలన్నారు. సహజంగానే మనవాళ్లకు ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుందని.. అందుకే అభివృద్ధిలో మనం వేగంగా పురోగమిస్తున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో సగటు వృద్ధి రేటుతో పోల్చుకుంటే మన రాష్ట్రం వృద్ధి రేటు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణగా చెప్పారాయన. గూగుల్, ఉబర్, అమెజాన్ వంటి సంస్థల్నే ఉదాహరణగా తీసుకుంటే భిన్నంగా ఆలోచించడం ద్వారా ఆ సంస్థలు విజయవంతమయ్యాయన్నారు. హుద్ హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో కాస్త భిన్నంగా ఆలోచించడం వల్లే పైసా పెట్టుబడి లేకుండా తుఫాన్ వచ్చిన ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఎల్‌ఈడి లైట్లను అమర్చేలా చేయగలిగామన్నారు. డబ్బుంటే సుఖం గురించి ఆలోచిస్తాం.. అదే డబ్బు లేకపోతే విభిన్న ఆవిష్కరణలు చేయగలుగుతామని దీనికి ఉదాహరణే ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఫైబర్ నెట్ వ్యవస్థను కేవలం 320 కోట్ల రూపాయలతో పూర్తిచేసి 149 రూపాయలకే కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్, టెలిఫోన్ వంటి సౌకర్యాలను అందజేయబోతున్నామన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా దాన్ని నడిపించాల్సింది మనుషులే కాబట్టి వాళ్లు సమర్ధులై సమర్ధంగా నడిపిస్తేనే విజయాలు సాధ్యమవుతాయన్నారు. పిల్లల కోసం భూములు కొని ఆస్తులు పోగెయ్యడం కన్నా వారిని చక్కగా చదివిస్తే అదే వారికి ఆస్తిగా మారుతుందని, ఈ విషయాన్ని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో శిక్షణకు వెళ్లొచ్చిన విద్యార్థులు రుజువు చేయబోతున్నారని చెప్పారు. మన దేశంలో ఉండే కుటుంబ విలువలు, అనుబంధాలు అమెరికా, చైనా వంటి దేశాల్లో కనపడవని, అందుకే మనవాళ్ళు అత్యంత సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే 2029 నాటికి దేశంలోనే అత్యంత సంతోషంగా ఉండే రాష్ట్రంగా ఏసిపి మొదటి స్థానంలో నిలబెట్టాలని భావిస్తున్నానన్నారు. సాధారణ విద్యార్థుల్ని అసాధారణ విద్యార్థులుగా మారుస్తున్న విద్యాసంస్థల మేనేజ్‌మెంట్లను ముఖ్యమంత్రి అభినందించారు.
మీ సహకారంతోనే సాధ్యమైంది...
ఈ సందర్భంగా ఆయా కాలేజీల నుంచి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో శిక్షణకు వెళ్లొచ్చిన విద్యార్థులంతా తామేం నేర్చుకున్నదీ, తామేం కావాలనుకుంటున్నదీ ముఖ్యమంత్రికి వివరించారు. తాము స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి శిక్షణ పొందేలా ప్రోత్సహించడం ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం వల్లనే సాధ్యమైందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన తాము ప్రభుత్వం ఇచ్చిన పీజుల రీ యింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లతోనే చదువుకున్నామని చెప్పారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇచ్చిన శిక్షణతో తామంతా పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకుంటున్నామని, తమలాంటి చాలామందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ, యువజన సర్వీసులు, ఎన్నారై శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ సర్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిఈఓ గంటా సుబ్బారావు పాల్గొన్నారు.