ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ కేసులో మరో ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 27: అగ్రిగోల్డ్ కేసులో మరో ఇద్దరు నిందితులను ఏపి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ కేసులో మొత్తం 19మందిని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేయగా వీరిలో ఇప్పటి వరకు 11మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా అవ్వా ఉదయ్ భాస్కరరావు (56), అవ్వా వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ (53)లను అరెస్టు చేశారు. వీరిద్దరూ కూడా అగ్రిగోల్డ్ ప్రాజెక్టు లిమిటెడ్, అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫర్మ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా ఉన్నారు. అరెస్టయిన వీరిద్దరినీ సిఐడి పోలీసులు శుక్రవారం ఏలూరు కోర్టులో హాజరపరుస్తారు. అగ్రిగోల్డ్ కేసులో కోర్టు ఆదేశాలతో సీజ్ చేసిన ఆస్తులను వేలం ద్వారా విక్రయించే కస్టమర్లకు పంచే ప్రక్రియను సిఐడి డిజి ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు వేగవంతం చేశారు. ఇటీవలే ఇద్దరిని అరెస్టు చేసిన సిఐడి ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు అవ్వా బ్రదర్స్‌ను అరెస్టు చేయడం గమనార్హం.