ఆంధ్రప్రదేశ్‌

రాష్టవ్య్రాప్తంగా బేబీకేర్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: రాష్టవ్య్రాప్తంగా బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసే యోచన ఉందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. సచివాలయ ఉద్యోగులతోపాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని సునీత తెలిపారు. అందుకోసమే సచివాలయంలో ప్రత్యేకంగా బేబీకేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో నిర్వహిస్తున్న బేబీకేర్ సెంటర్‌ను గురువారం మధ్యాహ్నం ఆమె సందర్శించారు. అనంతరం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆమె మట్లాడారు. సచివాలయంలో నిర్వహిస్తున్న బేబీకేర్ సెంటర్‌లలో 13 మంది వరకు చిన్నారులు ఉన్నారన్నారు. బేబీ సెంటర్‌లలో కొన్ని సమస్యలున్నట్లు సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. సచివాలయంలో బేబీకేర్ సెంటర్‌ను మోడల్ సెంటర్‌గా ఏర్పాటు చేశామని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అపర్ణ తెలిపారు. ఆ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 55వేల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా అత్యుత్తమ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. అంతకుముందు మంత్రి పరిటాల సునీత సచివాలయం బేబీ సెంటర్‌లలో ఉన్న చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు.