ఆంధ్రప్రదేశ్‌

20 ఏళ్లపాటు మేమే అధికారంలో ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: రాష్ట్రంలో 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనను ఒక ప్రశ్న అడుగుతున్నారని తెలిపారు. ‘దేశంలో మళ్లీ ఎన్నికలు వచ్చి ఒకవేళ మీరు ఓడిపోతే మా పరిస్థితి ఏమిట’ని అడుగుతున్నారన్నారు. ‘మేము కష్టాలు పడాల్సిందేనా?’ అని అంటున్నారన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సమస్యే లేదని స్పష్టం చేశారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. గతంలో ఏదోచేయాలని తొందరపడి పరుగెత్తడం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చిందని గుర్తుచేశారు. ఈసారి అలాకాకుండా సుస్థిర పాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారే 2019లో గెలుస్తారన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒసారి ఎన్నికలు జరగడం సరికాదన్నారు. ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడు ఇబ్బందిపడే కంటే ఒకేసారి ఇబ్బందిపడితే సరిపోతుంది కదా! అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు సీతాదేవికి శీలపరీక్షలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీల ఆధిపత్యం పెరుగుతుందన్న వాదన కరెక్టు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుస్థిర పాలన అవసరమన్నారు. సుస్థిర పాలన రాష్ట్రంలో ఉంది కనుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు హైదరాబాద్ పాకిస్తాన్‌లో ఉందా? అని అడిగేవారని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉందంటే ఎలా రావాలని ప్రశ్నించేవారన్నారు. వీటన్నింటనీ దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని కేంద్రాన్ని ఒప్పించానన్నారు. ఆలోచనా విధానం సరిగా ఉంటే అన్నీ అర్థవౌతాయని పరోక్షంగా జగన్‌ను ప్రస్తావిస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు