ఆంధ్రప్రదేశ్‌

ఖైదీ సుభానీకి బంగారు పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30: రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ఎస్‌కె సుభానీ అనే ఖైదీకి డిగ్రీలో బంగారు పతకం లభించింది. గుంటూ రు జిల్లా క్రోసూరుకు చెందిన సుభానీ ఐదేళ్ల క్రితం రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు వచ్చాడు. జైలుకు వచ్చిన తరువాత విద్యపై దృష్టిసారించిన సుభానీ జైలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ దూర విద్య అధ్యయన కేంద్రం ద్వారా డిగ్రీలో చేరాడు. గత ఏడాది జరిగిన పరీక్షలో సుభానీ అత్యధిక మార్కులు సాధించి డిగ్రీ పట్టాతో పాటు, బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా సుభానీ బంగారు పతకాన్ని స్వీకరించనున్నాడు.