ఆంధ్రప్రదేశ్‌

జెడ్పీటిసి, ఎంపిటిసి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న వివిధ జెడ్పీటిసి, ఎంపిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జెడ్పీటిసి స్థానాలకు, 17 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు జెడ్పీటిసి స్థానానికి, కుక్కునూరు జెడ్పీటిసి స్థానానికి ఎన్నిక జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి, కాటుకూరు, నర్లవరం, తత్కురుగొమ్ము, భూదేవిపేట, రేపాకగొమ్ము, రామవరం, కుక్కులూరు మండలంలోని అమవరం, దామచర్ల, మాదవరం, వింజరం, కివ్వాత, కుక్కులూరు 1, కుక్కులూరు 2, దాచరం, పేరవల్లి మండలంలోని టిపర్రు, శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలంలోని గెడ్డ కంచరం, ఎంపిటిసి స్థానాలకు నిర్వహించనున్నారు. ఈ నెల 5న రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 5 నుండి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 9న పరిశీలన, 11న అప్పీళ్ల పరిష్కారం చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీన గడువుగా నిర్ణయించారు. 21వ తేదీ పోలింగ్, 23న కౌటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.