ఆంధ్రప్రదేశ్
వచ్చాడు.. పోయాడు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 May 2017
విజయవాడ, మే 2: ప్రభుత్వాన్ని తిట్టడానికే రైతుదీక్ష పేరిట గుంటూరులో సభ ఏర్పాటు చేసినట్లుందని వైకాపా అధినేత జగన్ను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘రైతుల కోసమని పెట్టిన సభకు జగన్ వచ్చాడు.. పోయాడు. కానీ ఈ దీక్షకు జనం మాత్రం రాలేదు’ అని ఎద్దేవా చేశారు. తనపై విమర్శలకు పనితీరుతోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. 30రోజుల్లో 1600 మందికి ఐటి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో మంచినీటి సరఫరాపై 77 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి లోకేష్ వివరించారు.