ఆంధ్రప్రదేశ్‌

ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దతు ధరకు గడువు పొడిగింపు మరో 4 యార్డుల్లోనూ అమలు
యార్డుల సెలవులు తగ్గింపు శని, ఆదివారాల్లోనూ కొనుగోళ్లు
ధరలు తగ్గిస్తే ఊరుకోం మంత్రులు సోమిరెడ్డి , ఆదినారాయణ హెచ్చరిక

అమరావతి, మే 5: మిర్చి రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి హామీ ఇచ్చారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అవసరమైతే అదనంగా ఇచ్చే రూ.1500లను జూలైలో కూడా కొనసాగిస్తామని చెప్పారు. మిర్చి క్వింటాల్‌కు రూ.1500ల చొప్పున ఒక్కో రైతుకు 20 క్వింటాళ్ల వరకు అదనపు ధర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రకారం ఒక్కో రైతుకు రూ.30వేలు వారి వారి ఖాతాల్లోనే జమ అవుతున్నట్లు తెలిపారు. రైతులనుంచి వచ్చే మిర్చి బస్తాల లారీలు పెరిగిపోతుండటంతో వ్యాపారులు, కూలీలు, గుమస్తాలతో మాట్లాడి శనివారం, ఆదివారం కూడా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. యార్డుకు మే 6 నుంచి 40 రోజులు సెలవులని వాటిని 20 రోజులకు తగ్గించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా దాచేపల్లి, కృష్ణాజిల్లా నందిగామ, ప్రకాశం జిల్లా పర్చూరు, కర్నూలు మార్కెట్ యార్డుల్లో కూడా రూ.1500లు ఇచ్చే పథకం అమలు చేస్తామని చెప్పారు. మిర్చి రైతుల సమస్యల పట్ల దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఇంకా మార్కెట్‌కు రావలసిన మిర్చి చాలా ఉందని మంత్రి చెప్పారు. 85వేల మంది రైతులు మార్కెట్‌కు రావలసి ఉందని గుర్తించినట్లు తెలిపారు.
కర్నూలులో మిర్చి రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులు మనోధైర్యంతో ఉండాలన్నారు. పత్రికలు కూడా రైతులను ఆందోళనకు గురిచేసే విధంగా వార్తలు రాయవద్దని కోరారు. ప్రతిపక్షం ఈ సమస్యను రాజకీయంగా చూడవద్దని, రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడవద్దని మంత్రి సోమిరెడ్డి కోరారు.
కేంద్రం ప్రకటించిన పథకం ప్రకారం ఎఫ్‌ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) రకం మిర్చి రూ.5000లకు అమ్మితే వచ్చే నష్టంలో సగం కేంద్రం భరిస్తుందని, అయితే ఆ నష్టం రూ.1250లకి మించకూడదని మంత్రి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీతో సంబంధం లేకుండా రైతులకు అదనపు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు.
మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి రైతులకు మానసికంగా మద్దతు పలకాలన్నారు. 30 శాతం రైతులకు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రతిపక్ష నేత రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు. రైతులకు తక్కువ మొత్తంలో జమ అయినట్లు ఒక పేపర్లో రాశారని, అది వాస్తవం కాదని చెప్పారు. నిధులకు కొరతలేదని అదనపు ధర పథకం ప్రకారం రైతులకు వారి వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి చెప్పారు.
నిబంధనలు సరళం: ప్రిన్సిపల్ సెక్రటరీ
రైతులకు సర్ట్ఫికెట్లు ఇచ్చే నిబంధనలు సరళం చేసినట్లు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ చెప్పారు. గతంలో రైతులకు మాన్యువల్‌గా సర్ట్ఫికెట్లు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు భూమి వద్దే సర్ట్ఫికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, హార్టీకల్చర్ శాఖల అధికారులు ఈ పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. ఇప్పటికి 300 బిల్లులు చెల్లింపు దశలో ఉన్నాయని, రూ.10 కోట్ల వరకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

చిత్రం.... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పక్కన మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, అధికారులు