ఆంధ్రప్రదేశ్‌

టిటిడి చైర్మన్ పదవి కోసం బాబును కలిసిన రాయపాటి, మురళీమోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: ప్రతిష్ఠాత్మకమైన టిటిడి చైర్మన్ పదవి కోసం దానిని ఆశిస్తున్న నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వేర్వేరుగా కలిశారు. టిటిడి చైర్మన్ పదవి పట్ల తమకున్న ఆసక్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాయపాటి నాకూ దేవుడికి సేవ చేయాలనే ఉంది. ఆయన దయ, బాబు ఇష్టం. అయినా నేను వచ్చింది పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న బాబును అభినందించడానికే అని అన్నారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి చైర్మన్‌గా పనిచేయాలని ఉంది. ఆ పదవి వస్తే నా అంత అదృష్టవంతుడు ఉండడు. ఈనెల 26,27,28 తేదీల్లో అమెరికాలో జరిగే తానా సభలకు వెళ్లేందుకు బాబు అనుమతి కోరా అన్నారు.