ఆంధ్రప్రదేశ్‌

దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 15: గత రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు అండ్ కో రూ.2లక్షల కోట్లను దోచుకుందని, ఆ సొమ్మును దాచుకోవడానికి సిఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె విలేఖరులతో మాట్లాడారు. రోజంతా రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని అవినీతిలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం డ్రామా రక్తికట్టిందని, అయితే కేంద్రమంత్రి సుజనా చౌదరి మారిషస్ బ్యాంకుకు వందల కోట్లు ఎగ్గొట్టారని, అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టడమే బాబు డ్రామాకు నిదర్శనమన్నారు.