ఆంధ్రప్రదేశ్‌

నియోజకవర్గాల అభివృద్ధిపై మంత్రులతో స్పీకర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో తన చాంబర్‌లో వివిధ శాఖల మంత్రులతో మంగళవారం సమీక్షించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మార్కెట్ యార్డు, రెండు నియోజకవర్గాల్లోని గిరిజనుల అభివృద్ధి, గతంలో వేసిన రోడ్లు పాడైపోయినందున వాటి మరమ్మతులకు నిధుల కేటాయింపుపై చర్చించారు. రెండు నియోజకవర్గ పరిధిలో 400 శ్మశాన వాటిక అభివృద్ధికి నిధుల మంజూరు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని పెండింగ్‌లో ఉన్న 60 కోట్ల పనుల పూర్తి తదితర అంశాలపై చర్చించారు.