ఆంధ్రప్రదేశ్
సమావేశాల తీరుపై సిగ్గుగా ఉంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 May 2017
విజయవాడ, మే 16: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగిన తీరు చూస్తే సిగ్గుగా ఉందని వైసిపి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీల్లో విలేఖరులతో మాట్లాడుతూ. రైతుల మీద టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొన్నారన్నారు. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించటం లేదన్నారు. రైతుల దగ్గర తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి హెరిటేజ్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్నారు. తమ పార్టీపై బురదజల్లి తప్పించుకున్నారని, ఇదంతా రైతులు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజు త్వరలో వస్తుందన్నారు.