ఆంధ్రప్రదేశ్‌

రైతులను మోసంచేసిన బాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 16: రాష్ట్రంలో రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం జగన్ మీడియా చిట్‌చాట్ చేశారు. ‘ప్రభుత్వానికి పివి సింధు మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు. ఒక క్రీడాకారిణిగా ఆమెపై అభిమానం ఉండటంలో తప్పులేదు. కానీ గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇవాల్టి నుంచి మిర్చి యార్డ్‌కు సెలవు ప్రకటించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డ్‌కు సెలవు ఇచ్చారు. రైతులు సమస్యల్లో ఉంటే యార్డ్‌ను మూసేస్తారా? ఇదేనా మీరు చెప్పే రైతురాజ్యం’ అని జగన్ నిలదీశారు. మిర్చికి కేంద్రం క్వింటాల్‌కు 5వేల రూపాయలు ఇస్తానన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీ విషయంలోనూ మాట తప్పి రైతులను దగా చేశారన్నారు. ‘జీఎస్టీ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే రెండు నిమిషాల్లో అయ్యేదానికి ప్రభుత్వం రాద్ధాంతం చేసింది. రైతుల సమస్యలపై మాట్లాడదామంటే తప్పించుకుంది. అ అంటే అభివృద్ధి, అమరావతి కాదు. అ అంటే అవినీతి, అ అంటే అరాచకాలు, అ అంటే అనారోగ్యం, అ అంటే అబద్ధాలు’ అని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా కోసం ఎంపిల రాజీనామాలపై ప్రశ్నించగా నిన్ననే కదా చెప్పింది అని దాటవేశారు.