ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 June 2017
రాజమహేంద్రవరం, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని సిఐడి డైరెక్టర్ జనరల్ ద్వారకాతిరుమలరావు స్పష్టంచేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అసెంబ్లీలోని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ గదిలోకి వర్షపునీరు లీకై, రాష్టస్థ్రాయిలో వివాదాస్పదం కావడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ సంఘటనా స్థలంలో పైపు కోసినట్లు గుర్తించామన్నారు. కోసిన పైపును అలాగే వదిలేశారన్నారు. అసెంబ్లీ నిర్మాణంపై సంబంధిత కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడామని స్పష్టంచేశారు. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన ద్వారకా తిరుమలరావు విలేఖర్లతో మాట్లాడారు.