ఆంధ్రప్రదేశ్‌

నా వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: విశాఖలో భూ కుంభకోణాన్ని వెలికితీయడం వల్ల ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ఠ పెరిగిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి గంటా శ్రీనివాసరావుతో విభేధాలు లేవని స్పష్టం చేశారు. సిఎంకు గంటా రాసిన లేఖలో తన పేరు ఎందుకు ప్రస్తావించారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. తన వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ తగ్గలేదని, పెరిగిందన్నారు. విశాఖలో వేలాది ఎకరాల భూమి ఆక్రమణలకు, కబ్జాలకు గురి అవుతోందన్నారు. పేదల భూమిని రౌడీయిజంతో ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. రికార్డుల తారుమారు, ఆక్రమణలు వంటివి జరుగుతున్నాయని, దీనిని సిఎం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఈ వ్యవహారాల వెనుక కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యారని తెలిపారు. పేదలకు న్యాయం చేసేందుకే ఈ వ్యవహారంపై సిట్‌ను సిఎం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.