ఆంధ్రప్రదేశ్‌

సిబిఐ విచారణకు ఆదేశించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 16: విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయని, రూ. 20 వేల కోట్ల విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయమై సిబిఐతో సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌కు శుక్రవారం ఆయన లేఖ పంపారు. ఈ లేఖప్రతులను స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కొణతాల అందజేసారు. వెబ్‌ల్యాండింగ్ వలన మంచి జరుగుతుందనుకుంటే అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు. సరైన మెకానిజం లేకపోవడం వలనే ఈ దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. కలెక్టర్ కూడా జిల్లాలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని, లక్షలాది ఎకరాల ఎఫ్‌ఎంబిలు గల్లంతయ్యాయని చెప్పారు.