ఆంధ్రప్రదేశ్‌

బాబు కనుసన్నల్లోనే భూ దందా: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన తనయుడు నారాలోకేష్ కనుసన్నల్లోనే టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విశాఖలో లక్ష ఎకరాలను దోచేశారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్‌ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విశాఖలో లక్ష ఎకరాలను దోచుకున్న నేతలు తమ బండారం బయటపడకుండా తాము ఆక్రమించుకున్న భూములకు సంబంధించిన న రికార్డులన్ని హుద్‌హుద్ తుఫాన్‌లో పోయాయని చెబుతున్నారని, ఈవిషయాన్ని స్వయంగా ఆజిల్లా కలెక్టర్ చెప్పడమే దారుణమన్నారు. దీనిని తాము ప్రశ్నిస్తే వైకాపా అభివృద్ధికి అడ్డం పడుతోందని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతుంటే బాధ్యతగల ప్రతి పక్షంగా తాము ఎదుర్కొంటున్నామన్నారు. విశాఖ భూకుంభకోణాలకు వ్యతిరేకంగా ఈనెల 22వ తేదీన అన్ని పార్టీలతో కలసి మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.