ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి నిధుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 16: ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో రాష్ట్రానికి లక్షల కోట్లు వరదలా వస్తున్నాయని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పచ్చిమాంసం తినే సంస్కృతి కలిగిన కాంగ్రెస్ బిజెపిని విమర్శిస్తోందని, ఆవును తినడం వల్లే కాంగ్రెస్ వినాశనమైందని ఆయన ఆరోపించారు. గోవులను చంపి ఆ మాంసం తింటారు కాబట్టే కాంగ్రెస్‌కు మతిభ్రమించిందన్నారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో శుక్రవారం జరిగిన సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సమ్మేళన్‌లో కాంగ్రెస్‌పై వీర్రాజు నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ భద్రాచలం రాముడిని తిరిగి తీసుకురాగలదా? అని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను, భద్రాచలం రాముడిని తెలంగాణకు ఇచ్చేసిన కాంగ్రెస్‌కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాయలసీమను దగాచేసి దుమ్ముగూడెంను తెలంగాణకు పట్టుకుపోయిన కాంగ్రెస్ దగాకోరు పార్టీ అని ఆరోపించారు. సామాన్య వ్యక్తి నరేంద్రమోదీ దేశాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేస్తున్నారని చెప్పారు. పదేళ్లు కేంద్ర మంత్రిగావున్న పళ్లంరాజు సొంత జిల్లా తూర్పు గోదావరికి ఒక్క ప్రాజెక్టు కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో తూర్పు గోదావరి జిల్లాకు రూ.3600 కోట్ల నేవిగేషన్ ప్రాజెక్టు, రూ.330 కోట్లతో కాకినాడ మెయిన్ లైన్, రూ.1.34 లక్షల కోట్లతో నాలుగు లేన్ల రోడ్లు, రూ.450 కోట్లతో నల్లజర్ల రోడ్డు, రూ.3600 కోట్లతో అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యూనిట్ వచ్చిందన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళన్‌ను ప్రారంభించిన బిజెపి ఎపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ మూడేళ్లలో ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా పాలన సాగించిన ఘనత నరేంద్రమోదీనన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను మోదీ తీర్చిదిద్దుతున్నారన్నారు. ఒక దేశం, ఒక పన్ను పేరిట జిఎస్‌టి అత్యంత విప్లవాత్మక పన్ను సంస్కరణ అని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరుగుతోందని, ఏ పార్టీ అయినా చర్యలు తీసుకుంటారని సమావేశం అనంతరం తనను కలిసిన మీడియాతో కంభంపాటి హరిబాబు చెప్పారు.

చిత్రం.. సమ్మేళన్‌ను జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభిస్తున్న బిజెపి ఎపి అధ్యక్షుడు కంభంపాటి