ఆంధ్రప్రదేశ్‌

బాబూ నీ భూ దాహం తీరదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: రాజధాని నిర్మాణం పేరుతో మరో 14 వేల ఎకరాలను సేకరించడం పట్ల వైఎస్‌ఆర్‌సిపి తీవ్రంగా వ్యతిరేకించింది. నీ భూ దాహం తీరదా..? ఇంకా 14 వేల ఎకరాలు కావాలా..? అంటూ సిఎం చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి పార్థసారథి నిప్పులు చెరిగారు. శనివారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు, నాలుగు వేల ఎకరాల్లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకోవచ్చని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, మేధావులు ఎంత చెప్పినా మొండిగా 33 వేల ఎకరాలు సేకరించి, ఇప్పుడు మళ్లీ మరో 14 వేల ఎకరాలను సేకరించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇక టిడిపి నేతలు ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేయడం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యమా, లేక రాక్షస పాలనో అర్థం కావడం లేదని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిపై టిడిపి నేతలు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేవలం పెట్టుబడి దారుల కోసమే భూసేకరణ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే సేకరించిన భూములు ఎడారిగా మార్చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా భూదాహానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.