ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని కేంద్రీకరిస్తే మరో ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: రాజధాని అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తే ప్రత్యేక తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో మరో ఉద్యమం ఊపిరి పోసుకోవడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు. వెనుకబడిన జిల్లాలపై కూడా ప్రభుత్వం దృష్టిని సారించాలని హితవు పలికారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో ఆదివారం ఆయన పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు పుట్టా హరినాథరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రైతుల నుంచి సమీకరించిన 34వేల ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ తప్ప మరో నిర్మాణం జరగలేదని రామకృష్ణ అన్నారు. రాజధాని నిర్మాణానికి మరో 31వేల ఎకరాల అటవీ భూమి అవసరమవుతుందని కేంద్రాన్ని కోరిన ప్రభుత్వం, రింగ్‌రోడ్డు నిర్మాణం పేరుతో మరో 14వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించాలని నిర్ణయించటం సరికాదన్నారు. కేంద్రం కూడా చంద్రబాబు కోరినంత అటవీ భూమిని ఇవ్వకూడదన్నారు. అభివృద్ధికి ఏమేరకు అవసరమవుతుందో అంతే ఇవ్వాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో రైతులిచ్చిన భూమిని పెట్టుబడిగా మార్చి పెట్టుబడిదారీ విధానాన్ని తీసుకొచ్చే యత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈవిషయమై అందరినీ కలుపుకుని ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూ శాస్త్రాన్ని అపహాస్యం చేస్తూ వ్యవసాయ శాస్తవ్రేత్తలను కించపరుస్తున్న సుభాష్ పాలేకర్ సారథ్యంలో విశ్వవిద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకురావటం దారుణమన్నారు. లక్షలాది కోట్లు ఖర్చుపెట్టి అనేక సంవత్సరాలపాటు పరిశోధనలు చేసి కొత్త వంగడాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను శాస్తవ్రేత్తలు ఆవిష్కరిస్తుంటే అందుకు భిన్నంగా ఆవుపేడ, మూత్రంతో ప్రకృతి వ్యవసాయం చేస్తామంటూ మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తుంటే ఇక శాస్తవ్రేత్తలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయాభివృద్ధికోసం 100 ఎకరాలు కేటాయించడమే కాకుండా రూ.100 కోట్ల నిధులను సమకూరుస్తామని సిఎం ప్రకటించడం దారుణమన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ కరవు ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని వామపక్షాలు చేసిన పోరాటానికి విజయం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీలు, పంటల బీమాను అందజేయాలని నిర్ణయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్స్‌లు అమలుచేయాలని, కరవు ప్రాంతాల్లో పంట రుణాలను మాఫీ చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 24 నుంచి 26వరకూ ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే విశాఖ భూముల కేసును సిబిఐతో దర్యాప్తు చేయించేందుకు కేంద్రాన్ని కోరాలని రామకృష్ణ కోరారు.