ఆంధ్రప్రదేశ్
ఐదు జిల్లాల జిఎస్టి కమిషనర్గా శ్రీహరిరావు నియామకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 June 2017
విజయవాడ (క్రైం), జూన్ 23: గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల జిఎస్టి కమిషనర్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఎం శ్రీహరిరావు నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం గుంటూరులోని జిఎస్టి పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన చెన్నై సర్వీస్ టాక్స్ అప్పీల్స్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు. 1991 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర మెట్రోపాలిటన్ నగరాల్లో విశిష్ట సేవలు అందించారు. ప్రస్తుతం గుంటూరు ప్రధాన కార్యాలయం నుంచి జిఎస్టి కమిషనర్గా ఐదు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రంలో పని చేయడం ఇదే తొలిసారి.