ఆంధ్రప్రదేశ్
పీజీ వైద్య విద్యార్థులకు ఏడాది పాటు వైద్య సంస్థల్లో సేవలు తప్పనిసరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, జూన్ 23: వివిధ వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్ సీట్లను కన్వీనర్ కోటా కింద పొందిన విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ వైద్య సంస్థల్లో తప్పనిసరిగా పని చేయాల్సి ఉంటుంది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ డిగ్రీ, డిప్లొమో విద్యార్థులు తమ అకడమిక్ ప్రోగ్రాం పూర్తి అయ్యాక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సీనియర్ రెసిడెంట్ వైద్యులుగా సంవత్సరం పాటు ఇకపై సేవలు అందించాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన వారు తమ స్వంత సంస్థలో సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది. పిజి డిప్లొమో విద్యార్థులకు 20 వేల రూపాయలు, పిజి డిగ్రీ విద్యార్థులకు 23 వేలు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 25 వేల రూపాయలు నెలకు గౌరవ వేతనంగా చెల్లిస్తారు. మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు నెలకు 50 వేల రూపాయలు ఆయా సంస్థలు గౌరవ వేతనం చెల్లిస్తాయి. నాన్-సర్వీస్ విద్యార్థి బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉల్లంఘిస్తే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకూ పెనాల్టీ విధిస్తారు.