ఆంధ్రప్రదేశ్‌

ఏ ఛానళ్లనూ బహిష్కరించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: ‘‘48 గంటలపాటు టీవీ ఛానల్స్ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మీడియాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గౌరవభావంతో చూస్తుందని’’ టిడిపి ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టిడి జనార్దన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకు వైసిపి ఆధ్వర్యంలోని సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మీడియా అంటే గౌరవం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియాకు ఎంతో స్వేచ్ఛ ఉందన్నారు. ఇటీవలి కాలంలో వైసిపి ఆధ్వర్యంలో సోషల్ మీడియా నిర్వహిస్తున్న పాత్ర మీడియా ఇమేజీని దెబ్బతీసేలా ఉందని, దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.