ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుపై ఎస్‌సి, ఎస్‌టి కేసు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన, దళిత వ్యతిరేకంగా వ్యవహారిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, మొదటి ముద్దాయి ముఖ్యమంత్రే అవుతారని రఘువీరారెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చాపరాయి గ్రామంలో కలుషిత నీరు తాగి 16 మంది మృత్యువాత పడ్డారని, ఇంకా అనేక మంది మృత్యువుతో పోరాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతం ఒత్తం మలేరియా, డెంగ్యూ, రక్తహీనత, మూత్రపిండ సమస్యలు, కాళ్ళ వాపులతో బాధ పడుతున్నారని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ, ఆరోగ్య, గిరిజన శాఖల మధ్య ఏ మాత్రం సమన్వయం లేదని, వైద్య శాఖ నామమాత్రమైందని, వైద్య సిబ్బందిని నియమించలేదని, మందుల సరఫరా లేదని ఆయన విమర్శించారు.