ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్రకు అనుమతి తీసుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: పాదయాత్ర చేసేందుకు కాపు నేత ముద్రగడ పద్మనాభం అనుమతి తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పాదయాత్రకు ఇంకా ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని, అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదన్నారు. జాతీయ రహదారి మీదుగా పాదయాత్ర సాగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. వైకాపా నేత జగన్ ప్రోద్బలంతోనే ముద్రగడ, మందకృష్ణ రాజకీయాలు చేస్తున్నారన్నారు.