ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా ఏపి ఈ-సెట్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 9: రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ఈ-సెట్ ప్రశాంతంగా జరిగిందని ఏపి ఈ-సెట్ కన్వీనర్ ఆచార్య పిఆర్ భానుమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన పరీక్షకు 36,755 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 34,738 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షకు 94.51 శాతం విద్యార్థులు హజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షకు సంబందించిన కీ ని ఈ నెల 10వ తేదీన ఏపిఈసెట్.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని తెలిపారు. అలాగే ప్రశ్నా పత్రానికి సంబందించి ఏమైనా ఫిర్యాదులు 12వ తేదీలోపు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 16వ తేదీన ఫలితాలు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకు ముందు ఉదయం జెఎన్‌టియూ పరిపాలన భవనంలో పరీక్ష కోడ్‌ను ఏపిఎస్‌సిహెచ్‌ఈ సెక్రటరీ వరదరాజన్ విడుదల చేశారు. ఆ కోడ్ ఎం2గా అన్ని పరీక్ష కేంద్రాలకు ఫ్యాక్స్ ద్వారాను, ఈ మెయిల్ ద్వారాను పంపించారు.