ఆంధ్రప్రదేశ్‌

ఇసుక తవ్వుతూ ఇద్దరు కూలీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపూడి, మే 9: నిషేధిత రేవులో ఇసుక తవ్వుతూ ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. మరొకరు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శివపురం గ్రామ సమీపంలోని తమ్మిలేరులో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శివపురం రేవులో నాణ్యమైన ఇసుక లభిస్తుందని కూలీలు నిత్యం ఇక్కడ ఇసుక తవ్వకాలు సాగిస్తుంటారు. గత ఏడాది కురిసిన వర్షాలకు ఇక్కడి రేవులో ఇసుకపై ఒండ్రుమట్టి చేరడంతో పై పొరను వదిలి, సొరంగాలుగా చేసుకుని లోపలి ఇసుకను తవ్వుతున్నారు. ఈ నేపథ్యంలో శివపురం గ్రామానికి చెందిన విస్సంపల్లి లక్ష్మీనారాయణ (24), డియన్ రావుపేట గ్రామానికి చెందిన కోటమర్తి నరేష్ (25) లోతుగా తవ్విన సొరంగంలోకి వెళ్ళి ఇసుకను తవ్వుతుండగా సొరంగం ఒక్కసారిగా కూలిపోయింది. దీనితో వారు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో ఉన్న చిట్టూరి నవీన్‌బాబు అనే ఇంటర్ విద్యార్థి కాలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇతనిని తొలుత చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి, తదుపరి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.