ఆంధ్రప్రదేశ్‌

హోదా కన్నా... పోలవరమే మిన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఎన్‌జిఒల సంఘ నేత పరుచూరి అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలుంటాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అంశానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన అధికారుల పరిచయ కార్యక్రమంలో అశోక్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేఖరులతో అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరాటాన్ని రాజకీయ పార్టీలే చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రత్యేకహోదా అంశం రాజకీయ అజెండాగా మారిందన్నారు. ఇప్పుడు దీనిపై తాము ఆలోచించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్‌జిఒలు కీలకభూమిక పోషిస్తున్నారన్నారు.