ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం నేడు కాకినాడలో జగన్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్‌తో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉదయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిర్వహించే ధర్నాకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హోదాను డిమాండ్‌చేస్తూ వైసిపి ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరిగే ధర్నాకు జగన్ నాయకత్వం వహిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి ధర్నాకు హాజరు కానున్న నేపథ్యంలో వైసిపి నేతలు పెద్దఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడలో సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వైసిపి ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను యథాతధంగా అమలుచేసి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మంగళవారం ధర్నాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన జగన్ పోరాడుతున్నారని ఆయన అన్నారు.