ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో యువతి దారుణ హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కడప, జూలై 21: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం ఓ యువతి దారుణహత్యకు గురైంది. పట్టపగలు ఇంట్లో ఉన్న హైందవిరెడ్డి(23)ని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి అతి కిరాతకంగా హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని గోకుల్నగర్కు చెందిన జయప్రకాష్రెడ్డి, శ్రీవిద్య దంపతుల కూతురు హైందవిరెడ్డి బిటెక్ పూర్తిచేసి బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రొద్దుటూరులో కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కోచింగ్ నుంచి ఇంటికి వస్తూ తండ్రితో ఫోన్లో మాట్లాడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన జయప్రకాష్రెడ్డి దంపతులు రక్తపుమడుగులో పడి ఉన్న కూతురును చూసి కుప్పకూలిపోయారు. కాగా పథకం ప్రకారమే హైందవి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైందవిని బాత్రూమ్లోకి తీసుకెళ్లిన దుండగులు గొంతు కోయడంతో బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు రక్తం మడుగు కట్టింది. బెడ్రూమ్లో హైందవరెడ్డి మృతదేహం రక్తపుమడుగులో కనిపించింది. జయప్రకాష్రెడ్డి సొంత ఇంట్లో పై భాగంలో ఉంటున్నాడు. కింది భాగంలో కొంతమంది విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. డాగ్స్వాడ్ను రంగంలోకి దింపారు. తెలిసిన వారే ఆమెను వెంబడించి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.